×

అయోధ్య బాలరాముడికి భక్తుల కానుక.. 1,100 కిలోల ఢమరుకం !

 

అయోధ్యలోని బాలరాముడికి భక్తులు భారీ ఢమరుకాన్ని అందజేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన శివ బరాత్‌ జన్‌ కళ్లాణ్‌ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని రామయ్యకు సమర్పించింది. ఈ నగరాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బుధవారం అందజేసింది. వాయించినప్పుడు తబలా శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించడం మరో ప్రత్యేకత. మొత్తం 6 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉండే ఈ ఢమరుకానికి ఇప్పటికే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఢమరుకం ఇదే కావడం విశేషం.

దీని తయారీకి రూ.3 లక్షల ఖరీదైన ఇనుమను ఉపయోగించారు. పూర్తిగా ఇనుమును ఉపయోగించి అతిపెద్ద నగారాను మహాశివరాత్రి నాడు తయారుచేశారు. నగారా అనేది మధ్య ప్రాచ్యం వాయిద్యం. వీహెచ్‌పీ నేత లాల్‌మని తివారీ మాట్లాడుతూ.. ‘మంగళవారం ఉదయం రేవాలోని బైజు ధర్మశాల నుంచి ఢమరుకం తరలింపు మొదలైంది.. మధ్యాహ్నానికి రాష్ట్ర సరిహద్దులు దాటింది.. వేలాది మంది వీహెచ్‌పీ కార్యకర్తలు, ఇతర భక్తులు యూపీ సరిహద్దుల్లో ఘన స్వాగతం పలికారు... నరిబారీ, జారీ, గోహాన్యా, ఘర్‌పూర్, దాండి, నయా బ్రిడ్జ్, బాల్సన్ క్రాసింగ్, తేలియార్గంజ్, ఫాఫామౌ, సోరాన్, మౌయిమా మీదుగా బుధవారం ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకుంది’ అని తెలిపారు.

ఈ ఢమరుకాన్ని అయోధ్య మ్యూజియంలో భద్రపరిచనున్నారని ఆయన చెప్పారు. మరోవైపు, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు 6.9 అడుగుల ప్లైవుడ్‌పై హనుమాన్‌ చాలీసాను చెక్కి అయోధ్యకు తీసుకువచి సమర్పించారు.

  • March 15 , 2024
  • 09:44 am